సంగం డెయిరీ కేసులో… ధూళిపాళ్లకు బెయిల్

సంగం డెయిరీ కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఆ సంస్థ ఎండీ గోపాలకృష్ణన్కు హైకోర్టు బెయిల్ మంజూరైంది. నరేంద్రతో పాటు డెయిరీ ఎండీ గోపాల్కృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. విజయవాడలో నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.