Tirumala:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ..ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు. శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) ఆయనను స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట మంత్రి నారాయణ (Narayana) , టీటీటీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury ) తదితరులు ఉన్నారు.