జగన్ ను ఓడించే వరకు నిద్రపోయేది లేదు
దళితులంటే సీఎం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కోడికత్తా కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు ఐదేళ్లుగా జైలులో పెట్టడం దుర్మార్గమని, ఇప్పటికైనా అతడి విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ను ఓడించే వరకు నిద్రపోయేది లేదని తేల్చి చెప్పారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సరికాదన్నారు.













