Smart Ration Card : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డు (Smart Ration Card ) ల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీ నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌకబియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్ కోడ్ (QR Code) పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెస్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం. కొత్తవారికి, చిరుమానా మార్చిన వారికి కూడా పంపిణీ చేస్తాం.భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధమలూ (Godhamalu) అందజేస్తాం. డీలర్ల వద్ద ఈ -పోస్ యంత్రాలను ఆధునీకరిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా వీటి సంఖ్య పెంచాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేస్తున్నాం అని తెలిపారు.