ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట…

సంఘం డైరీ మాజీ అధినేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసింది. ఆయన వేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ధూళిపాళ్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్టు చేసింది. నరేంద్ర అస్వస్థతకు గురై జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దూళిపాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు నరేంద్రకు సీటీ స్కాన్, ఇతర పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఆయనకు కరోనా నిర్ధారణ అయితే వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది.