ఏపీలో కొత్తగా 8,239 కేసులు… 61 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్ సోకింది. 24 గంటల్లో 61 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,824కు చేరింది. 24 గంటల్లో 11,135 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 16,88,198 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,02,39,490 కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరులో 1,396 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి.