ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 91,231 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,85,716 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 12,671 మంది మరణించారు. 24 గంటల్లో 5,757 మంది బాధితులు కోలున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,32,971కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,074 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో 7, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అలాగే కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.