ఏపీలో భారీగా తగ్గిన… కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 71,758 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,224 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 4,714 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 18,24,319 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నేటి వరకు 2,18,04,691 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.