ఏపీలో తగ్గుముఖం పట్టిన..కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 12,269 మంది మరణించారు. 24 గంటల్లో 8,014 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,67,404 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,10,50,846 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కొత్తగా చిత్తూరు జిల్లాలో 9 మంది మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.