మళ్లీ వచ్చేది వైసీపీనే : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీనే రాసిపెట్టుకోండని వైఎస్ఆర్సీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన నేతల పై సెటైర్లు వేశారు. వాళ్లంతా ఒకరకమైన ట్రాన్స్లో ఉన్నారన్నారు. చంద్రబాబు అవినీతిపై వేల పేజీలతో పుస్తకాలు వేయొచ్చన్నారు. సీమన్స్ కంపెనీ పేరుతో రూ.250 కోట్లు దోచుకున్నారన్నారు. జాదు అనే పదానికి చంద్రబాబు, లోకేష్ సరిగ్గా సరిపోతారన్నారు. ఏ విచారణ చేద్దామన్నా కోర్టు కెళ్లి స్టే తెచ్చుకుంటూరన్నారు.













