శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేశారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సకల దేవతను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శనివారం నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు నల్లమల అడువుల గుండా భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. ఈ నెల 11 వరకు శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.






