ఏపీలో కరోనా పరీక్షలకు సంజీవని బస్సులు..
కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే సమర్ధవంతమైన పనితీరు చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు మరో కొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింద. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను మరింత ఎక్కువగా సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సంజీవిని పేరిట రూపకల్పన చేశారు. దీని కోసం మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది.













