Anitha:అధికారులు క్షేత్రస్థాయి లో అందుబాటులో ఉండాలి : అనిత

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో అధికారు లతో హోంమంత్రి అనిత(Home Minister Anitha) సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ (Control Rooms) ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కృష్ణా పరివాహకంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ (SDRF) , ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగులు (Hoardings) , కూలిన చెట్లను వెంటనే తొలగించాలన్నారు.