భన్వర్లాల్కు షాక్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పదవీ విరమణ చేసిన భన్వర్లాల్పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగంపై గతంలో ఆయనకు రూ.17 లక్షల మేర జరినామా విధించిది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వమే జరిమానా మొత్తాన్ని రూ.4,37,500 లకు కుదించింది. జరిమానా మొత్తాన్ని తగ్గించినా, ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













