ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ
జగనన్న విద్యా దీవెన పథకం చెల్లింపులలో ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తల్లులు ఫీజు చెల్లించకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఫీజులను కళాశాలల ఖాతాల్లో జమ చేయాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం విద్యా దీవెన కింద ఇచ్చే డబ్బును విద్యా సంస్థల ప్రిన్సిపల్ అకౌంట్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.













