ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..ఈ నెలాఖరు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేవించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారికి ఆదుకునేలా తగిన కార్యచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చుల కోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాన్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.