జర్మనీ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
జర్మనీ పర్యనటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ మూడు రోజుల పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృత్తి విద్య, శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలను మెరుగు పరచడంలో భాగంగా జర్మనీ అవలంబిస్తోన్న విధానాల అధ్యయనంలో భాగంగా ఈ పర్యటన చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరు బెర్లిన్లోని భారత రాయబారి పి.హరీష్తో భేటీ అయ్యారు. జర్మన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ స్కిల్డ్ క్రాఫ్ట్ విభాగాధిపతిగా హెండ్రిక్ వోస్ తో పలు అంశాలపై చర్చించారు.













