సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.













