24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్పై స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీపరంగా అయ్యన్నపాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 22న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.













