రిపబ్లిక్ డేలో శ్రీకాళహస్తి కలంకారీ ప్రదర్శన
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో ఆయన పాల్గొని శ్రీకాళహస్తి కళారూపాన్ని చాటాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించి, శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించినందుకు ఆయనకు ఈ అవకాశం లభించింది.













