అగ్రవర్ణ పేదలకు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త

అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లకు ఏ కేటగిరి కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లకు బి కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లకు సి కేటగిరీ కింద విభజించారు.