జులై 20 నుంచి మస్కట్ కు.. ఎయిర్ఇండియా సర్వీస్

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్లు నడిపేందుకు ఎయిర్ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జులై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్కు డైరెక్ట్ విమాన సర్వీస్ను ఎయిర్ఇండియా ప్రారంభించనుంది. ఎయిర్బస్ ఎ-321 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్ దేశ కాలమానం ప్రకారం మస్కట్కు మధాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్ను ప్రకటించడంతో పాటు టిక్కెట్ బుకింగ్ను కూడా ప్రారంభించింది.