2007 నుంచి 2012 నాటికి ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు
జబ్బు లబ్ధిదారులు
క్యాన్సర్ 3.02 లక్షలు
ప్రమాదాలు 1.66 లక్షలు
గుండె జబ్బులు 1.63 లక్షలు
మూత్ర సంబంధిత 1.23 లక్షలు
కిడ్నీ జబ్బులు 1.11 లక్షలు
న్యూరో సర్జరీ 85 వేలు
గర్భకోశవ్యాధులు 55 వేలు
పీడియాట్రిక్ సర్జరీ 45 వేలు
న్యూరాలజీ 42 వేలు
చెవి, ముక్కు, గొంతు 40 వేలు
కార్డియో ఎక్స్క్లూజివ్ 39 వేలు
ఇతర వ్యాధులు 2.50 లక్షలు
నిర్ణయాల్లో ‘వేగం..’ వ్యవస్థలపై ‘గౌరవం’
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. ఏ నిర్ణయం తీసుకున్నా పేదలకు మేలు చేసేదిలా ఉండాలన్నదే ఆయన లక్ష్యం. ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు వైఎస్ ఎంతో గౌరవం ఇచ్చేవారు. తాను ముఖ్యమంత్రిగా ఏ వ్యవస్థలోనైనా జోక్యం చేసుకోవచ్చుననే ఆలోచన.. ప్రయత్నం పొరపాటున కూడా వైఎస్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో అధికారులతో పాటు మీడియాకు చెందిన వారు కూడా మీరు (వైఎస్) ఒకసారి ఫలానా వారితో మాట్లాడితే బాగుంటుందని సూచించిన సందర్భాల్లో కూడా వైఎస్ చాలా తేలిగ్గా స్పందిస్తూ ఎవరు చేసే పని వారు చేయాలంటుండే వారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకు చెందిన పని ఆ వ్యవస్థ చేయాలనే వారు. తుపాను తదితర విపత్తులు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రచారం కోసం ఏనాడు ప్రయత్నించలేదు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని అధికార యంత్రాంగం వివరిస్తే వైఎస్ స్పందన చూసిన ఆ అధికారులు ఇప్పటికే మరిచిపోలేక పోతున్నారు.
కారుణ్య నియామకాల విషయంలో నిబంధనలు అంగీకరించడం లేదని అధికారులు పేర్కొంటే.. వాటిని సవరించి మరీ సాయం అదించారని అధికార యంత్రాంగం చెబుతూ ఉంటుంది. బియ్యం ధరలు పెరగడంతో ఒక రోజు హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కార్యాలయ అధికారులతో వైఎస్ సమీక్ష నిర్వహించారు. పావు గంట సమీక్షలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ నిర్ణయించడంతో సీఎం పేషీ అధికారులందరూ విస్తుపోయారు. కొంత సమయం తీసుకుందామని అధికారులు సూచించారు. ఆ వెంటనే ‘రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేస్తున్నాం.. వెంటనే మీడియాకు తెలియజేయండి.. రెండు రోజులు ఆలస్యం అయితే అధికారులు రకరకాల విశ్లేషణలతో సాధ్యం కాదంటారు’ అని వైఎస్ ఆదేశించారు.













