ఏపీలో కొత్తగా 8వేల కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 74,710 నమూనాలను పరీక్షించగా, 8,096 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 6,09,558కి చేరింది. 24 గంటల్లో 68 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది.కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పు గోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు, 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,244కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,803 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా 84,423 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 49,59,081 నమూనాలను పరీక్షించారు.






