యాపిల్ కీలక నిర్ణయం …
చైనీస్ యాప్ స్టోర్లోని 4,500 మొబైల్ గేమ్స్ను తొలగిస్తూ యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గాల్వన్ లోయలో ఉద్రికత్తల నేపథ్యంలో భారత్ ఇటీవలే 59 చైనీస్ యాప్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బ నుంచి చైనా తేరుకోకముందే మరోవైపు యాపిల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేవలం మూడు రోజుల వ్యవధిలో యాపిల్ ఇంత భారీగా యాప్లను తొలగించింది. మొబైల్ గేమింగ్ లెసెన్స్ నింబంధనల్లో యాపిల్ పలు సంస్కరణలకు చేపట్టింది. ఇందులో భాగంగానే యాపిల్ చైనా గేమ్స్ను తొలగించింది. చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ను తాము ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది. లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తాము గత ఏడాదే ప్రకటన చేసినట్లు యాపిల్ చెప్పింది. కావాలంటే తొలగించిన ఆ యాప్లను లైసెన్స్ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. యాపిల్ తీసుకున్న ఈ కఠిన చర్యలతో చైనా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.













