భారత్, అమెరికా మధ్య చర్చలు!
భారత్, యునైటెడ్ స్టేట్స్ల మధ్య ఇద్దరు ప్రతినిధుల సమావేశం న్యూఢిల్లీలో వచ్చే వారం జరుగుతుందని, వ్యూహాలతో భాగస్వాములైన ఇరుదేశాలు సిద్ధమవుతున్నాయని ట్రంప్ పాలనా యంత్రాంగం చెప్పింది. యుఎన్ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్ చర్చల కోసం విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరారు. వీరి ఇండియాలో తమతో సమాన హోదా ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వారాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్లతో రక్షణ ప్రధానమైన దౌత్య సంబంధ చర్చలు జరుపుతారని అమెరికా అధికార ప్రతినిధి హెదర్ నార్ట్ తెలిపారు. రెండు దేశాల రక్షణకు సంబంధించిన నిర్ణయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఆమె చెప్పింది. అమెరికా, భారత్ జాతీయ స్థాయిలో రక్షణ వ్యూహాలు, దక్షిణ ఆసియా, ఇండో పసిఫిక్ గణాంకాలపై ప్రధానంగా చర్చిస్తారని నార్ట్ పేర్కొన్నారు.













