హిల్లరీ క్లింటన్పై తులసీ గబ్బార్డ్ దావా
అమెరికాలో మొదటి హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్ అమెరికా మాజీ విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్పై పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు దాదాపు రూ.352 కోట్లు (ఐదు కోట్ల డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరిద్దరూ త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ తరపున బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో హిల్లరీ క్లింటన్ ఇటీవల తులసిని ఉద్దేశిస్తూ రష్యన్లకు ఇష్టమైన వ్యక్తి, రష్యా ఏజెంట్ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో తులసీ గబ్బార్డ్ న్యూయార్క్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.













