వంశీరెడ్డిని సన్మానించిన టిటిఎ బోస్టన్ ఛాప్టర్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) బోస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి సమావేశమయ్యారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయనపాల్గొని మాట్లాడారు. టిటిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కర్రా మల్లా రెడ్డి, డాక్టర్ జంద్యం దివాకర్ మరియు ప్రాంతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఈ మీట్ అండ్ గ్రీట్ విత్ టి.టి.ఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటుచేశారు. వీక్ డే అయినప్పటికీ ఎక్కువమంది పాల్గొనడం విశేషం. తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని ఇతరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.













