శీలం కృష్ణవేణి అధ్యక్షతన ఏర్పడిన టాoటెక్స్ 2018 నూతన కార్యవర్గం
తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు 2018 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 7 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో ప్రకటించారు.
ఈ సందర్బంగా శీలం కృష్ణవేణి సంస్థ అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు.
అధికారిక కార్యనిర్వాహక బృందం:
అధ్యక్షులు : శీలం కృష్ణవేణి
ఉత్తరాధ్యక్షుడు: వీర్నపు చిన్నసత్యం
ఉపాధ్యక్షుడు : కోడూరు కృష్ణారెడ్డి
కార్యదర్శి : మండిగ శ్రీలక్ష్మి
సంయుక్త కార్యదర్శి : కసగాని మనోహర్
కోశాధికారి: పాలేటి లక్ష్మి
సంయుక్త కోశాధికారి: కొణిదల లోకెష్ నాయుడు
తక్షణ పూర్వాధ్యక్షులు: ఉప్పలపాటి కృష్ణా రెడ్డి
కాజ చంద్రశేఖర్ , సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమా మహేష్, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, లంక భాను, ఎర్రం శరత్,
ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, బొమ్మ వెంకటేష్ , యెనికపాటి జనార్ధన్
పాలక మండల బృందం:
అధిపతి : డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి,
ఉపాధిపతి: కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్, ఎన్. ఎం.యస్. రెడ్డి,
మందాడి ఇందు రెడ్డి, నెల్లుట్ల పవన్ రాజ్, ఎర్రబోలు దేవేందర్,
కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2018 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ అధ్యక్షులు తెలిపారు.
2017 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ “శీలం కృష్ణవేణి గారి నేతృత్వంలో ఏర్పడిన 2018 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”, అని తెలిపారు.













