ఆస్ట్రేలియాలో ఘనంగా పీవీ విగ్రహ ఆవిష్కారణ
–> ఖండాంతరాలు దాటినా పీవీ ఖ్యాతి, ఆస్ట్రేలియాలో ఘనంగా మొట్ట మొదటి విగ్రహ ఆవిష్కారణ
–> విదేశీ గడ్డపై పీవీ విగ్రహం, ఇది చరిత్ర – మహేష్ బిగాల
–> పాల్గొన్న మేయర్ ఆఫ్ స్ట్రాత్ఫీల్డ్ మాథ్యూ బ్లాక్మోర్, ఎమ్మెల్సీ పీవీ వాణీదేవి, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల, స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్య రెడ్డి మరియు భారత పౌరులు.
ఖండాంతరాలు దాటినా పీవీ ఖ్యాతి, ఆస్ట్రేలియాలో ఘనంగా మొట్ట మొదటి విగ్రహ ఆవిష్కారణ జరిగింది, ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిధిగా మేయర్ ఆఫ్ స్ట్రాత్ఫీల్డ్ మాథ్యూ బ్లాక్మోర్, ఎమ్మెల్సీ పీవీ వాణీదేవి, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల, స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్య రెడ్డి, వివిధ సంస్థల సభ్యులు మరియు భారత పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మొదటగా సిడ్నీ లోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో వందలాది మంది సమక్షంలో ఆవిషరించారు అలాగే పుష్పాంజలి ఘటించారు, మొట్ట మొదటి పీవీ విగ్రహ ఆవిష్కారణ జరుగుతున్న సమయములో అక్కడ వున్నా అందరూ భావోద్వేగానికి లోనయ్యారు, ఈ విగ్రహాన్ని భారత దేశములో ప్రసాద్ గారు తయారు చేసారు. ఈ విగ్రహ ఆవిష్కారించడానికి స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. విగ్రహ ఆవిష్కారణ తరువాత అందరూ పీవీ శత జయంతి సభను జరుపుకోవడానికి టౌన్ హాల్ లోకి వెళ్లారు.
టౌన్ హాల్ లో ఉత్సవాలు మొదటగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో ప్రారంభం అయింది అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి పీవీ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ కమిటి సభ్యుడు మహేష్ బిగాల సభని ప్రారంభించారు. సభనుద్దేశించి అయన మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో సాంప్రదాయ సంరక్షకులైన ధరుగ్ ప్రజలను గుర్తు చేసుకున్నారు. అలాగే గత, వర్తమాన పెద్దలకు మేము గౌరవం ఇస్తున్నాము అని చెప్పి సభికులని అందరిని ఆహ్వానించారు.
మహేష్ బిగాల (PVNR సెంటెనరీ సెలబ్రేషన్స్ కమిటీకి కమిటీ మెంబర్ మరియు ఓవర్సీస్ కన్వీనర్) మాట్లాడుతూ PV నర్సింహారావు గారు 1991 నుండి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేసిన విషయం మీకు తెలిసిందే. ఆయన 28 జూన్ 1921న జన్మించి డిసెంబర్ 23, 2004 వరకు జీవించారు. జాతికి ఆయన చేసిన గొప్ప సేవలను గౌరవిస్తూ, నివాళులర్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏడాది పొడవునా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కేశవరావు గారు ఛైర్మన్గా మరియు పలువురు కమిటీ సభ్యులుగా ఆయన “PVNR శతజయంతి ఉత్సవాల కమిటీ”ని ఏర్పాటు చేశారు. శ్రీమతి వాణీ దేవి కమిటీ సభ్యురాలు మరియు నేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి కమిటీలో భాగం మరియు ఓవర్సీస్ కన్వీనర్. పానాడెమిక్ కారణంగా, మేము COVID ప్రోటోకాల్లకు లోబడి పరిమిత సమావేశాలతో 50కి పైగా దేశాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఈవెంట్లను నిర్వహించాము.
ఈ రోజు, మేయర్ మాథ్యూ బ్లాక్మోర్, కౌన్సిల్ సభ్యుడు శాండీ రెడ్డి మరియు ఇతర కౌన్సిల్ సభ్యులు మరియు మొత్తం భారతీయ ప్రవాసుల మద్దతుతో, మేము హోమ్బుష్ కమ్యూనిటీ సెంటర్లో పివి నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన గొప్ప చొరవ మరియు భారతదేశానికి చెందిన గొప్ప నాయకుడికి సేవ చేసే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఇటీవల కోల్పోయిన నా స్వర్గీయ తండ్రి శ్రీ బిగాల కృష్ణ మూర్తి, దీనిని బాధ్యతగా భావించవద్దు అని అన్నారు. అయితే 1 బిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయులకు సేవ చేసిన గొప్ప నాయకుడికి సేవ చేయడం మీకు లభించిన ప్రత్యేక అవకాశం.ఆస్ట్రేలియాలో మహాత్ముని విగ్రహం తరువాత ఒక భారత పౌరుడు అలాగే భారత దేశ ప్రధాని తోలి విగ్రహం పీవీ గారిది కావటం విశేషం అన్నారు. మొట్టమొదటి విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో ఆవిష్కారించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నారు, పీవీ గారి గురించి 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన ఆయన 17 భాషలు మాట్లాడేవారు. అతను “భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు”, ““గొప్ప సంస్కర్త”, “స్వాతంత్య్ర సమరయోధుడు”, “భారత అణు కార్యక్రమ పితామహుడు” ““పండితుడు”, “వ్యూహకర్త”, “రాజకీయవేత్త”, “అడ్వకేట్”, అన్నారు.
ఇది మహాత్మా గాంధీ తర్వాత ఆస్ట్రేలియాలో భారతీయ నాయకుడి రెండవ విగ్రహం మరియు భారత ప్రధాని యొక్క మొదటి విగ్రహం. హోమ్బుష్ కమ్యూనిటీ సెంటర్లో విగ్రహం స్థాపించబడింది, సులభంగా యాక్సెస్ చేయవచ్చు, ప్రతి ఒక్కరూ సందర్శించడానికి అనువైన ప్రదేశం. మేయర్ మాథ్యూ బ్లాక్మోర్, కౌన్సిలర్ శాండీ మరియు ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు మరియు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మరియు పివిజి విగ్రహానికి స్థలాన్ని అందించినందుకు మళ్ళీ ధన్యవాదాలు. స్ట్రాత్ఫీల్డ్లో భారతీయ ప్రవాసులు నివసిస్తున్నందున, విగ్రహం ఏర్పాటుకు ఇది ఉత్తమమైన ప్రదేశం. నాకు వ్యక్తిగతంగా, స్ట్రాత్ఫీల్డ్ భారతదేశానికి దూరంగా ఉన్న నా మొదటి ఇల్లు. అన్ని దారులను కనెక్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించినందున శ్రీ కర్రీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, చైర్మన్ కేశవ రావు, మొత్తం పీవీఎన్ఆర్ కమిటీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రములో కౌన్సిలర్స్ శ్రీని పిల్లమర్రి, లివింగ్స్టన్ చెట్టిపల్లి, రాజ్ దత్త, PV కజిన్ Dr. హేమచంద్ర మరియు మిగితా కుటుంబ సభ్యులు, Dr. భారతి రెడ్డి, హార్మోహం వాలియా మరియు తెలంగాణ, తెలుగు భారత సంఘాలు, స్థానిక PVNR కోర్ కమిటీ సభ్యులు: కెర్రీ రెడ్డి, రాజేష్ రాపోలు, అరవింద్ రెడ్డి, కిషోర్ బెండే, ఉపేందర్ గాడే, వెంకట్ రమణ & మెల్బోర్న్ నుండి ప్రయాణించిన అతని బృందం సంఘాలు అందరికి ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానంతరం పీవీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని కోరారు.
ఆస్ట్రేలియాలో లో విగ్రహం ఏర్పాటు చెయ్యడం సంతోషం : ఎమ్మెల్సీ వాణి దేవి (పీవీ కూతురు)
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విదంగా మొట్ట మొదటి పీవీ విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో ఆవిష్కారించడం చాల సంతోషంగా వుంది, పీవీ బిడ్డగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం, పీవీ గారి గురించి మాట్లాడాలి అంటే అయన బిడ్డగా ఎంతో వుంది , గంటల తరబడి మాట్లాడొచ్చు, అయన ఒక వ్యక్తి పదవులను ఆశించకుండా ప్రజలకు సేవ చేసారు. అయన 70 సంవంత్సరాల వయసులో దేశానికీ సేవ చేసారు. పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపిందన్నారు. తన విఘ్నతతో దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు. ఎన్నో ఉపన్యాసాలు, కవితలు పివి మీద వస్తున్నాయని ప్రశంసించారు. ప్రమాద అంచున ఉన్న భారత దేశాన్ని తన ఆలోచనతో ఆర్థికంగా గట్టెకించారన్నారు,ఆర్థికరంగంలో ప్రమాదపు అంచున ఉన్న దేశాన్ని తన ఆలోచనలతో గట్టెక్కించిన పీవీ.. జాతిరత్నంగా కీర్తనలు అందుకోవడం తమకు గర్వకారణమని దేశంలో పీవీ ఎన్నో సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని చెప్పారు. ఆస్ట్రేలియాలో విగ్రహం ఆవిషరించిన తరువాత వాణి దేవి గారు భావోద్వేగానికి లోనయ్యారు అలాగే ఇక్కడ పెట్టడానికి సహకరించిన మహేష్ బిగాల గారిని మనపూర్తిగా అభినందించారు. ఎన్నో నెలల తరబడి అందరిని సమన్వయము చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వించారని మహేష్ బిగాల ముందుండి కార్యక్రమాన్ని విజవంతం చేసారు అనాన్రు అలాగే స్ట్రాత్ఫీల్డ్ మేయర్, సందిరెడ్డి మిగితా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
పూర్వ భారత ప్రధాని పీవీ విగ్రహం స్ట్రాత్ఫీల్డ్ లో ఆవిష్కారణ మాకు సంతోషం అలాగే గౌరవం : మేయర్ ఆఫ్ స్ట్రాత్ఫీల్డ్ మాథ్యూ బ్లాక్మోర్
ఈ సందర్భంగా స్ట్రాత్ ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా అన్ని దేశాల ప్రజలను కలుపుకొనిపోయే సౌభ్రాతృత్వమున్న దేశమని అన్నారు. ఇలాంటి దేశంలో పీవీ నరసింహారావు లాంటి మాజీ భారత ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని, గొప్ప కార్యమని ఆయన కొనియాడారు.
స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కౌన్సిల్కు ఎన్నికైన మొదటి వ్యక్తి.. సీఎం కేసీఆర్ ఆలోచనలమేరకు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అందులోనూ తమ కౌన్సిల్ పరిధిలో చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇందులో భాగస్వాములైనవారికి, సహకారం అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు, మహేష్ బిగాల ఓవర్సీస్ కన్వీనర్ భారతదేశపు దివంగత ప్రధానమంత్రి పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని సంప్రదించారు. స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్లో పివి నరసింహారావు విగ్రహం గురించి మే 17, 2022న మేయర్ మాథ్యూ బ్లాక్మోర్తో సంధ్యా రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నీ తెలిపారు, భారత దివంగత ప్రధానమంత్రి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కౌంసిల్చొ లో చొరవ తీసుకున్నాం. మండలిలో పివి నరసింహారావు విగ్రహం, సుదీర్ఘ చర్చల తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మొదటి సమావేశం తరువాత మహేష్ బిగాల మరియు కౌన్సిలర్ సంధ్యా రెడ్డిల ప్రయత్నాలు వారి ప్రారంభ సమావేశం జరిగిన 5 నెలల్లోనే కార్య రూపం దాల్చాయి.













