అమెరికాలో విషాదకర ఘటన… ఓ తండ్రి విపరీత చర్యకు
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్ పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరగ్గా బాలుడి మృతికి కారణమైన ట్రెడ్మిల్ పరుగు దృశ్యాలను సాక్ష్యాలుగా న్యాయస్థానంలో ప్రదర్శించారు. ఆ ఏడాది మార్చి 20న క్రిస్టోఫర్ తన కుమారుడు కోరీని స్థానికంగా ఉన్న ఓ ఫిట్నెస్ సెంటర్కు తీసుకెళ్లాడు. బాలుడిని ట్రెడ్మిల్పై పరిగెత్తించాడు. అంతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమారు కిందపడ్డాడు. అయినప్పటికీ ఆగకుండా మళ్లీ ట్రెడ్మిల్ ఎక్కించాడు. మారాంచేస్తే కొట్టాడు. కొన్ని రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్ 1న బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడిరది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మరుసటిరోజే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు స్కానింగ్లో తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యలు ద్రువీకరించారు.







