లాస్ వెగాస్ లో డ్రోన్ ద్వారా మానవ మూత్రపిండాలు రవాణా
ప్రపంచం కరోనా వైరస్ బారిన పడే ముందు డ్రోన్ సేవలు పరిమితం గా ఉన్న సంగతి తెలిసిందే అయితే కరోనా వైరస్ కారణంగా డ్రోన్ సేవలు ప్రాధాన్యత పెరిగింది అనే చెప్పాలి. చిన్న ఎక్స్ప్రెస్ ప్యాకేజీలను పంపిణీ చేయడం, శోధన మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడటం మరియు అద్భుతమైన వైమానిక వీక్షణలను సంగ్రహించడం లో డ్రోన్లను బాగా ఉపయోగిస్తున్నారు. అయితే కొత్తగా ఈ జాబితాలో మానవ అవయవ రవాణా కూడా చేరనున్నది.మానవరహిత విమానయాన పరిష్కారాలను అందించే మిషన్ జిఓ మరియు అవయవ సేకరణ సంస్థ నెవాడా డోనర్ నెట్వర్క్ పరిశోధకులు లాస్ వెగాస్లో డ్రోన్ల ద్వారా మానవ అవయవం మరియు కణజాలాలను విజయవంతం గా రవాణా చేసినట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 17 న మొదటి సారి మానవ పరిశోధన కార్నియాస్ ని డ్రోన్ ద్వారా 2 మైళ్ళ దూరంలో ఉన్న 2 ఆసుపత్రులు మధ్య రవాణా చేయగా అదే రోజు మరొక డ్రోన్ లాస్ వెగాస్ విమానాశ్రయం నుండి 10 కిలోమీటర్ల దూరంలో లాస్ వెగాస్ ఎడారిలోని ఒక చిన్న పట్టణం వెలుపల ఉన్న ప్రదేశానికి పరిశోధన మానవ మూత్రపిండాలను డ్రోన్ డెలివరీ చేసింది.
లాస్ వెగాస్ లో డ్రోన్ ద్వారా డెలివరీ చేసిన మూత్రపిండము పరిశోధన ప్రయోజనాల కోసం మాత్రమే అయినప్పటికీ డ్రోన్ డెలివరీ ముందు మరియు తరువాత బయాప్సీలు తీసుకున్న శాస్త్రవేత్తలు టిష్యూ ఆర్కిటెక్చర్ మరియు సెల్ వైబిలిటీలో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు.













