ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఇది చాలా కంపెనీలలో తొలగింపులు, వేతన కోతలకు దారితీస్తోంది. ఇప్పడు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు తొలగించాలని నిర్ణయించింది. దీనిలో డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి అధికారులు ఉన్నారు. సంస్థ ఈ వేటు దశలవారీగా చేయనుంది. వైదొలిగే ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇవ్వనుంది. అదే సమయంలో కాగ్నిజెంట్ తన అమెరికన్ ఉద్యోగుల కోసం స్వచ్ఛంద విభజన పథకాన్ని (విఎస్సి) ప్రకటించింది. డిమాండ్ తగ్గడం, తక్కువ ఒప్పందాల కారణంగా సంస్థకు ప్రాజెక్టులు లేకపోవడంతో శ్రామిక శక్తి తగ్గిస్తోంది.













