ఆటా కన్వెన్షన్ 2024.. తరలి వస్తున్న అతిరథ మహారధులు
అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలను ఈ సంవత్సరం అట్లాంటాలోని జార్జియా వరల్జ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. అట్లాంటాలో అత్యంత భారీగా, మిన్నంటేలా జరగనున్న ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగబోతు న్నాయి. ఆటా వారు యువత తమకు ఎంత ముఖ్యమో చాలాసార్లు తెలియజేసారు, చేతల్లో చూపిస్తున్నారు కూడా. యువతకు ఉపయోగకరంగా మరియూ సరదాగా సాగే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వారికి ఒక ప్రత్యేక కమిటీ ఉండడం ముదావహం. వినోద, వివేక, విజ్ఞానాల కలబోతగా ఉండబోతున్న కన్వెన్షన్ గురించి ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక విందు సరే సరి, తెలుగు వారి వంటకాలు నోరూరేలా, ఘుమ ఘుమ లాడుతూ చాలానే ఉండబోతున్నాయి. వివిధ రంగాలలో ప్రముఖులకు ఆటా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. పొద్దు పోయాక జరిగే మ్యూజికల్ కాన్సర్ట్లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జార్జియా కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం చాలా పెద్దది. కన్వెన్షన్కి 15 నుండి 20 వేల మంది వస్తారని అంచనా, వీళ్ళందరికీ ఈ సెంటర్ చాలా వసతిగా ఉంటుందని భావించి ఆటా నాయకులు ఈ మహాసభలకోసం ఈ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో చాలా టీములు కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు గురించి సూచనలు చేసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ, మహాసభల విజయవంతానికి వేల మంది వందలాది రోజులు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఇది అభినందనీయం. అందరూ రండి, కన్వెన్షన్లో పాలు పంచుకోండి అన్నారు.
కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ పలు కమిటీలను, నాయకులను, వాలంటీర్లను అనుసంధాన పరుస్తూ, ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియా నుండి తేవలసిన వస్తువులు. ఇక్కడ కావలసినవి ఇప్పటికే సమకూరుస్తున్నారు. ఎక్సిబిట్స్ విషయానికి వస్తే, దాదాపు 200లకు పైగా స్టాల్ల్స్ ఉండబోతున్నాయి. ఇంకా చాలా మంది పెడదామనుకున్నా, ఇంక అవకాశం లేదని నిర్వాహకులు చెప్పారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరుతో పాటు ఎంతో మంది కృషి చేస్తున్నారు.
ప్రముఖులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, దామోదరరాజ నర్సింహ, ఉత్తమ్కుమార్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ (స్పీకర్), ఎమ్మెల్యేలు హరీష్ రావు, నలమాడ పద్మావతి, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట్రమణారెడ్డి, మధు సూధన్ రెడ్డి తదితరులను ఆహ్వానించాము.
సాహిత్యరంగానికి సంబంధించి నందిని సిదారెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, తల్లావరaు్జల పతంజలి శాస్త్రి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, కాసర్ల శ్యామ్, అఫ్సర్, అంబికా అనంత్, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, కల్పన రెంటాల, నారాయణస్వామి శంకరగిరి, శివ సోమయాజుల, మధు పెమ్మరాజు, వడ్డేపల్లి కృష్ణ, అనిల్ రాయల్ తదితరులను ఆహ్వానించాము.
సినిమా రంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ, బోనీ కపూర్, జాన్వీకపూర్, అంకితా జాదవ్, మెహ్రీన్ పిర్జాదా, ఖుషీ కపూర్, గౌరీ ప్రియ, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా, రోహిణి, వి.జె. సన్ని తదితరులను ఆహ్వానించాము. అలాగే జబర్దస్త్ నరేష్, సరయు, మిమిక్రీ రమేష్ తదితరులను కూడా ఆహ్వానించాము. సంగీత రంగానికి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, అనూప్ రూబెన్స్, మీనాక్షి అనిపిండి తదితరులను ఆహ్వానించాము. బిజినెస్ రంగం నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ మహాసభలకు తరలివస్తున్నారు. ఆధ్యాత్మికగురు కమలేష్ డి. పటేల్ (దాదాజీ) కూడా ఈ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
అమెరికా అతిధులు
జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ని ఆహ్వానించారు, ఆయన వీలుంటే తప్పకుండా వస్తాను అన్నారు. అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ను కూడా సాదరంగా ఆహ్వానించారు. కన్వీనర్ కిరణ్పాశం మాట్లాడుతూ, కాన్సులేట్ జనరల్ రావడం కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తుందని శ్లాఘించారు. అలానే, లోకల్ లీడర్స్ ఎందరినో పిలిచామనీ, వారందరూ విచేస్తున్నారని సెలవిచ్చారు. కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, ఇతర నాయకులను ఆహ్వానించడం, వారు మన్నించడం జరిగింది.
సినీనటీనటుల రాక
ఆటా మహాసభలకు పలువురు సినీనటీనటులు వస్తున్నారు. విజయ్ దేవరకొండ, శ్రీలీల, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు వస్తున్నామని నిర్ధారించారు.







