ఈ సారి హైదరాబాద్ టూ అమెరికా నేపధ్యం లో సీక్వెల్ గా ‘జాతిరత్నాలు 2’
పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా.. కొత్త దర్శకుడు అయినా.. చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ని షేక్ చేసి.. సూపర్ హిట్గా నిలిచిన సినిమా ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్ బ్యానర్ లో కే.వీ.అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు జాతిరత్నాలు సినిమాకి సీక్వెల్ని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు అనుదీప్. సినిమా బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అని మరోసారి నిరూపించిన సినిమా ‘జాతిరత్నాలు’. నిర్మాతలు పెట్టిన డబ్బుకంటే దాదాపు 20 రేట్లు ఎక్కువ లాభం సంపాదించింది ‘జాతిరత్నాలు’. ఇక విషయానికొస్తే….. జోగిపేట అనే గ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చిన కష్టాలు ఎదురుకున్న యువకుల పాత్రల్లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి జీవించేశారు. హీరోయిన్ ఫిరియా అబ్దుల్లా చేసింది మొదటి సినిమా అయినప్పటికీ.. ఆ ఫీల్ ఏమాత్రం లేకుండా అద్భుతంగా నటించింది. సినిమా మొదటి సీన్.. నుంచి చివరి సీన్ వరకూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్న ప్రేక్షకులు సినిమాను బ్లాక్బస్టర్ హిట్ చేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బుల్లితెరపై కూడా ఆడియన్స్ని అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని దర్శకుడు అనుదీప్ ప్లాన్ చేస్తున్నాడట. తొలి భాగం కంటే రెట్టింపు కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించాలని స్కెచ్ వేశాడట. తొలి భాగంలో జోగిపేట నుంచి ముగ్గురు కుర్రాళ్లు హైదరాబాద్కి ఉద్యోగం కోసం రావడం, అక్కడ అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కోవడం దాని కారణం వాళ్లు పడ్డ కష్టాలను కామెడీగా చూపించాడు. ఇక సీక్వెల్ గా వచ్చే రెండవ భాగం లో ఈ ముగ్గురు కుర్రాళ్లు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడ వాళ్లు ఎదురుకొనే కష్టాలు చూపించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాని కూడా ‘జాతిరత్నాలు’ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.













