‘సర్కారు వారి పాట’ ను తన పాటలతో మహేష్ కెరీర్ లోనే మ్యూజికల్ హిట్ చేస్తాడంటా థమన్ ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో నటించనున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకుంటూ దూసుకెళ్తున్న సూపర్ స్టార్ ఈ మూవీతో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఎంతో భారీగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో మహేష్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రీతిలో ఉంటుందని, ముఖ్యంగా ఇందులోని ఆయన యాక్షన్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ వంటివి ఎంతో అదిరిపోతాయని అంటున్నారు. తొలిసారిగా మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది దీనికి ఫోటోగ్రఫి అందించనున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని మంచి స్పందన లభించింది. ఇక నేడు కొన్ని ప్రముఖ తెలుగు దిన పత్రికలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా సంగీత దర్శకడు థమన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, తనకు సూపర్ స్టార్ తో మంచి అనుబంధం ఉందని, గతంలో ఆయనతో పని చేసిన దూకుడు, ఆగడు, బిజినెస్ మ్యాన్ సినిమాలు తన కెరీర్ లో ఎంతో గొప్ప పేరు తెచ్చాయని, ఇక ప్రస్తుతం చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత ఆయనతో చేస్తున్న ఈ సర్కారు వారి పాట మూవీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై తాను ఎంతో బాగా శ్రద్ధ తీసుకుంటున్నానని, అలానే ఇప్పటికే సినిమాలో రెండు సాంగ్స్ కంపోజింగ్ పూర్తి అవగా మిగతా సాంగ్స్ కంపోజింగ్ జరుగుతోందని అన్నారు. అలానే షూటింగ్ మొదలయ్యే సమయంలో సినిమాలోని సాంగ్స్ విషయమై ఫ్యాన్స్ కి ఒక మంచి అప్ డేట్ కూడా ఇవ్వనున్నాం అని కూడా చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అమితానందం వెల్లివిరుస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత మహేష్ తో చేస్తున్న ఈ సినిమాకి థమన్ ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలని అంటున్నారు.













