జార్జియాకు సైరా ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా. రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధం అవుతుంది. ఇటీవలే హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్స్లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ షెడ్యూల్ని జార్జియాలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను అక్కడ భారీ ఎత్తున తెరకెక్కిస్తారట. వచ్చేనెల మొదటి వారం నుండి అక్కడ షూటింగ్ జరగనుంది. నయనతార, తమన్నా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తారట.













