పద్మావత్ కు లైన్ క్లియర్
సంజయ్ లీలా భన్సాలీకి పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఆయన తెరకెక్కించిన పద్మావత్ మూవీపై నిషేధం విధించే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. దీంతో జనవరి 25న దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్కు అడ్డంకులు తొలిగిపోయాయి. సీబీఎఫ్సీ కొన్ని షరతులతో సినిమా రిలీజ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ సినిమాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సినిమాపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలు సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.













