ఎస్ పి బాలు కి కరోనా నెగటివ్, “ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడూ” అని ఎస్పీ చరణ్ ని అడిగారట!
నెల రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్నఎస్ పి బాలు..కరొనా ను జయించారు. గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పిన ఎస్పీ చరణ్.. సోమవారం నాడు తన తండ్రి ఎస్పీబాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు.గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాను జయించారు. ఆగష్టు 5 నుంచి కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు.. ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. కరోనా నెగిటివ్ వచ్చిందని క్షేమ సమచారాన్ని అందించారు ఎస్పీబీ తనయుడు చరణ్. “నాన్నగారు కోలుకుంటున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. మునుపటితో పోలిస్తే నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గానే ఉంది.
అయితే వెంటిలేటర్ తొలగిస్తారని భావించాం కానీ ఇంకా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో అది సాధ్యం కాలేదు. వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుందని డాక్టర్ల చెప్పారు.. అయితే ప్రస్తుతం వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెళ్లిరోజు సందర్భంగా అమ్మానాన్నలు ఇద్దరూ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. నాన్న రాయగలుగుతున్నారు.. క్రికెట్, టెన్నిస్ మ్యాచ్లు చూస్తున్నారు.. ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు”.. అని వీడియోలో ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
View this post on Instagram













