రష్మిక మందన్నకు బంపర్ ఆఫర్
ముగ్ధమనోహర సౌందర్యం, మైమరిపించే అభినయం మేలికలయికగా యువకుల హృదయాల్ని దోచుకుంటున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. చలో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ సొగసరి గీత గోవిందం సినిమాతో యూత్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో విజయ్దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నది. ఇదిలావుండగా రష్మిక మందన్న తమిళంలో బంపర్ఆఫర్ను సొంతం చేసుకుంది. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ సరసన నాయికగా నటించే సువర్ణావకాశాన్ని సంపాదించుకుంది. అట్లి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా ఖరారైంది. ఈ సుందరి ప్రస్తుతం కన్నడంలో రెండు సినిమాల్లో నటిస్తున్నది. తెలుగులో కూడా పలు ఆఫర్లు వస్తున్నట్లు తెలిసింది.













