‘ఆచార్య’ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్కి భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చిన మెగా హీరోలు?.. వైరల్ అవుతున్నన్యూస్!
మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య కొన్న డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోయారు. గత కొన్ని నెలలుగా వారు నష్టాన్ని కొరటాల శివ, మేకర్స్ భర్తీ చేస్తారేమోనని వెయిట్ చేశారు. ఇప్పుడు కొరటాల ఆఫీసులో కూర్చుకున్నారు. దీనికి తోడు ఇంకా 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని భావించినట్లు సమాచారం. ఈ గొడవ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వరకు చేరింది. ఆచార్య సినిమా రిలీజ్కు ముందే.. భారీ మొత్తంలో థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాలు వచ్చాయి. ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలను కొరటాల శివ భుజాలకెత్తుకున్నారు. తర్వాత సినిమా డిజాస్టర్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్కు కలిగిన నష్టాలను తీర్చే బాధ్యతలను కూడా ఆయనే డీల్ చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లు ఎదురు చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల శివ మాటపై ఆగుతూ వచ్చారు. ఇక ఓపిక పట్టలేక ఇప్పడు ఏకంగా కొరటాల శివ ఆపీసుకి వచ్చి గొడవ పడ్డారని సినీ సర్కిల్స్లో వార్తలుగా వినిపిస్తున్నాయి.
కొరటాల శివ ఆఫీసులో 40 మందికి పైగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ను శాంత పరచడానికి కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యవహారం కుదుటపడలేదు. హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ కొరటాల శివ పేరుతో ట్విట్టర్లోనూ విషయం ట్రెండ్ అయ్యింది. దీనికి తోడు ఇంకా 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని భావించినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ గొడవ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వరకు చేరడంతో వారు తమ వంతుంగా విషయాన్ని కూల్గా సెటిల్ చేశారని అంటున్నారు. అందులో భాగంగా రూ.20 కోట్ల మేరకు అడ్వాన్సులుగా తీసుకున్న మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్కు ఇచ్చేశారని సినీ సర్కిల్స్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని కొరటాల శివ తీర్చడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మెగా హీరోలు డిస్ట్రిబ్యూటర్స్కు రూ.20 కోట్ల మేరకు తిరిగి ఇచ్చారని తెలుస్తోంది.













