Nithya Menon: ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పిన నిత్య
అలనాటి అందాల తార, మాజీ సీఎం జయలలిత(Jaya Lalitha) చనిపోయాక ఆమెపై సినిమాలు, వెబ్ సిరీస్లు తీయాలని ఎంతోమంది రెడీ అయ్యారు. ఏఎల్ విజయ్(AL Vijay) డైరెక్షన్ లో కంగనా(Kangana)ను లీడ్ రోల్ లో పెట్టి తలైవి అనే భారీ సినిమా తీయగా, గౌతమ్ మీనన్(Gowtham menon) దర్శకత్వంలో రమ్య కృష్ణ(Ramya Krishnan)తో క్వీన్(Queen) అనే సిరీస్ ను జయలలిత జీవిత కథ ఆధారంగానే తీశారు.
వీటికి పోటీగా నిత్యా మీనన్(Nithya Menon) ప్రధాన పాత్రలో ది ఐరెన్ లేడీ(The Iron Lady) అనే టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీ కోసం నిత్య కొన్నాళ్ల పాటూ వర్క షాపులో కూడా పాల్గొంది. జయ లలిత పాత్రకు నిత్యనే పర్ఫెక్ట్ అనేలా తనని తాను మలచుకుంది అని అంతా అనుకున్నారు. సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేటనుకునే టైమ్ లో ఆ సినిమా గురించి అప్డేట్స్ రావడం ఆగిపోయాయి.
ఐదేళ్ల తర్వాత రీసెంట్ డా నిత్య ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాల్ని వెల్లడించింది. జయ లలిత బయోపిక్ చేయాలని అందరూ ఎంతో ఆశపడ్డామని, డిస్కషన్స్ జరిగాయని, కానీ తమ సినిమా అనౌన్స్ చేశాక అదే కథతో తలైవి, క్వీన్ సిరీస్లు రావడంతో అదే కథపై మళ్లీ సినిమా చేస్తే రిపీట్ అవుతుందని ఎంతో ఇష్టపడిన ప్రాజెక్టును ఆపేశామని నిత్య పేర్కొంది.













