Nagarjuna: ఏఎన్ఆర్ కళాశాల కోసం 2 కోట్ల స్కాలర్షిప్ ఫండ్ ని అనౌన్స్ చేసిన నాగార్జున అక్కినేని
కింగ్ నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, సిబ్బంది, హాజరైన వారందరికీ ఒక చిరస్మరణీయ క్షణాన్ని అందించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,.. తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు.
“ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పని చేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు, ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత.
ఈ ప్రకటనకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి కరతాళ ధ్వనులు లభించాయి. ఇది కేవలం కుటుంబం యొక్క ఉదారతను మాత్రమే కాకుండా, విద్య, సమాజ సేవతో వారికి ఉన్న శాశ్వత అనుబంధాన్ని కూడా చాటింది.






