శేఖర్ కమ్ముల నాగ చైతన్యల ‘లవ్ స్టోరీ’ షూటింగ్ ఫినిష్
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న తాజా సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ రియలిస్టిక్ ప్రేమకథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. తాజాగా పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థియేటర్లు తెరుచుకుని ప్రేక్షకుల సందడి మొదలు కాగానే ‘లవ్ స్టోరి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్ మ్యూజిక్ : పవన్ సి.హెచ్ సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.













