రంగస్థలం ముఖ్యఅతిథిగా మెగాస్టార్
రామ్చరణ్, సమంత నాయకానాయికలుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18న విశాఖపట్టణంలోని ఆర్కే బిచ్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖయ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. అలాగే పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. వేడుకలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ నేతృత్త్వంలో సంగీత కార్యక్రమంతో పాటు ఇతర సాంస్కవృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.













