‘యాత్ర 2’ లో మమ్ముట్టి కోసం భారీ ఆఫర్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రంలో లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా.. మమ్ము్ట్టి భారీ రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. మలయాళ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న మమ్ముట్టిని మాలీవుడ్ అభిమానులు మెగాస్టార్గా పిలుచుకుంటారని తెలిసిందే. ఇక ఆయన తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. దివంగత దర్శకులు కె విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతి కిరణం’ తెలుగులో మమ్ముట్టికి మొదటి చిత్రం కాగా.. 2019లో ‘యాత్ర’ సినిమాలో నటించారు. ఇది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా తెరకెక్కించిన విషక్ష్ం తెలిసిందే.
ఇక ఇటీవలే అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘ఏజెంట్’ చిత్రంలోనూ మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘యాత్ర 2’ తెరకెక్కించేందుకు దర్శకుడు మహి వి రాఘవ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం మమ్ముట్టి తీసుకోబోయే రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘యాత్ర’ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ ప్రస్తుతం ‘యాత్ర 2’ స్క్రిప్ట్పై పని చేస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ మూవీ కోసం రూ. 14 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో జీవా నటించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
మొత్తం మీద 2024 ఎలక్షన్స్కు ముందుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, డైరెక్టర్ మహి వి రాఘవ. ఇటీవలే ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్ రూపొందించాడు. ఇందులో ప్రియదర్శి, అభివన్ గోమఠం, జోర్దార్ సుజాత, చైతన్య తదితరులు నటించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. ఇదే క్రమంలో తాజాగా ‘సైతాన్’ పేరుతో మరో వెబ్ సిరీస్తో ముందుకొస్తున్నారు. కాకపోతే ఆ ట్రైలర్లో వయొలెన్స్ పాళ్లు ఎక్కువగా ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.













