మహేష్ బాబు సరసన నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్?
సర్కారువారి పాట మూవీ సక్సెస్ తరువాత సూపర్స్టార్ మహేష్ బాబు SSMB 28 మూవీకి రంగం దాదాపు సిద్ధమైంది. ఇది వరకే అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. కాగా సెకండ్ హీరోయిన్కి సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. చెన్నై బ్యూటీ మహేష్ సినిమాలో సందడి చేయనుందని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. మహేష్ బాబు సరసన అందాల తార పూజాహెగ్డే మరోసారి జతకడుతోంది.
తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనే దానిపై కూడా మేకర్స్ నిర్ణయం తీసేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అదెవరో కాదు.. చెన్నై బ్యూటీ ప్రియాంక్ అరుల్ మోహన్. నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్తో శ్రీకారం వంటి చిత్రాల్లో అమ్మడు హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో వంటి భారీ హిట్ తర్వాత త్రివికమ్ర్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్ మూవీకి రైటర్గా వర్క్ చేశారు. తర్వాత మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సూపర్ స్టార్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మళ్లీ దాదాపు పుష్కరకాలం తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయింది. ఈసారి ఎలాగైనా మహేష్తో హిట్ కొట్టాలనే ఆలోచనతో త్రివిక్రమ్ పక్కాగా స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.త్రివిక్రమ్ ఈ సినిమా కోసం స్టార్ నటీనటులను లైన్లో పెడుతున్నారట. ఇప్పటికే విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమార్.. ముగ్గురిలో ఒకరు మహేష్కి విలన్గా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.













