24 గంటల్లో 100 మిలియన్ల వ్యూస్ తో కేజీఎఫ్-2 సరికొత్త రికార్డు
హంబలీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకుడిగా రూపొందుతున్న కేజీఎఫ్-2 టీజర్ సంచలం సృష్టింస్తోంది. పాన్ ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ ట్రైలర్ కోసం దాదాపు ఏడాదిగా ఎదురు చూసారు అంతేకాదు దీనిపై భారీ అంచనాలను సైతం పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ అదిరిపోయింది. ముందుగా జనవరి 8వ తేదీ యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనుకుంది చిత్ర యూనిట్. కానీ అభిమానులకు సర్ప్రైజ్గా ఓ రోజు ముందుగానే ట్రైలర్ను విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ టీజర్ గురించి మాట్లాడితే బాహుబలికంటే అదిరిపోయే విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
పాన్ ఇండియా రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఇక అధీరగా సంజయ్ దత్ లుక్ సినిమాకే హైలెట్. దీనికి తోడు యశ్ క్యారెక్టరైజేషన్, ట్రైలర్ చివర్లో మిషన్ గన్ బ్యారెల్కు సిగరెట్ కాల్చుకునే సీన్ అదిరిపోయిందనే చెప్పాలి. కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్-2. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథకు పార్ట్-2తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగింపునివ్వనున్నాడు. ఈ చిత్రంలో రవీనా టాండన్ రమీకా సేన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచిందనే చెప్పాలి. తల్లికిచ్చిన మాటకు కట్టుబడిన కొడుకు కథగా పార్ట్-2ను తెరకెక్కించారని టీజర్ చివర్లోని ఓ సన్నివేశం చెప్పకనే చెప్పింది.
ఇదిలా ఉంటే సినిమా దేశ వ్యాప్తంగా అనేక భాష్లలో విడుదల అవుతుండడం వల్ల టీజర్ ను వినూత్నంగా విడుదల చేశారు. 24 ఘంటల్లో 100 మిలియన్ల వ్యూస్ తో కేజీఎఫ్-2 సరికొత్త రికార్డు సృష్టించింది సాధారణంగా టీజర్ అంటే హీరో డైలాగ్లు, విలన్ వాయిస్ ఇవన్నీ వినిపించాలి. అయితే పలు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండడం వల్ల అన్ని టీజర్ ను కాకుండా.. అన్ని భాషలకు కలిపి ఒకటే విడుదల చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్లు లేవు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి.













