Kandula Dugesh: కోట శ్రీనివాసరావు మృతిపై మంత్రి కందుల దుర్గేష్ సంతాపం

తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు( Kota Srinivasa Rao). కోట మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటువిలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయనాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు.
ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడు కోట శ్రీనివాసరావు. నటనలో తెలుగునాట చెరిగిపోని ముద్ర కోట శ్రీనివాసరావుది..ఆయన నటన చిరస్మరణీయం. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా, తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా రాణించారు. తమిళనం, కన్నడం, హిందీ, మళయాలం తదితర భాషల్లో నటించి నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేసిన మహానటుడు కోట శ్రీనివాసరావు.
కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించి మెప్పించి నంది, సైమా వంటి ఎన్నో సినీ అవార్డులు అందుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. కోట శ్రీనివాసరావు మృతిపై ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.