డిసెంబర్ 1న సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి “జవాన్” మూవీ గ్రాండ్ రిలీజ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాల్ని మించి ఉండడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. టీజర్ లో మాస్ కమర్షియల్ అంశాల్ని మేళవించడంతో పాటు… కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత….. అంటూ… దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కి అందరూ ఫిదా అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే… జవాన్ లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. టీజర్లో తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా కనిపిస్తోంది. దీంతో పాటు ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం వినూత్న రీతిలో… ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. పబ్లిసిటీలో మరో కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ…. దేశానికి జవాన్ ఎంత అవసరమో… ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలి అని చెప్పడమే మా ఉద్దేశ్యం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు. తన కుటుంబాన్ని మనోదైర్యంతో, బుద్దిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ప్రసన్న స్పెషల్ క్యారెక్టర్ లో నటించారు. డిసెంబర్ 1న జవాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అని అన్నారు.
చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ…. బివిఎస్ రవి రచయితగా ఎంత సక్సెస్ అయ్యాడో మనకు తెలిసిందే. ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభ చూపించుకునే చిత్రం జవాన్. సాయి ధరమ్ తేజ్ లోని యాక్టింగ్ పొటెన్షియాలిటీని మరో లెవల్ కు తీసుకెళ్లే చిత్రమిది. కమర్షియల్ చిత్రాల్లో భిన్నమైన స్క్రీన్ ప్లే, పవర్ ఫుల్ పెర్ ఫార్మెన్స్ లతో జవాన్ ఉండనుంది. జవాన్ టైటిల్ ను జస్టిఫై చేసే స్టోరీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేస్తున్నారు. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో జవాన్ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నాం. అని అన్నారు.
చిత్ర నిర్మాత కృష్ణ మాట్లాడుతూ… సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు బివిఎస్ రవి చెప్పిన కథ కంటే కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. సాయి ధరమ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోవడం ఖాయం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది. మా బ్యానర్ నుంచి ఈ సినిమా రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. డిసెంబర్ 1న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే భారీ ప్రమోషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్ర పబ్లిసిటీని సైతం ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు – సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ – కెవి గుహన్
మ్యూజిక్ – తమన్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
ఎడిటింగ్ – ఎస్.ఆర్.శేఖర్, మధు
సహ రచయితలు – కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను
బ్యానర్ – అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ – దిల్ రాజు
నిర్మాత – కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – బివిఎస్ రవి













